ఓటుకు నోటు..సంచలన వీడియో..!

256
vote for note case
- Advertisement -

తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో సంచలన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన ఈడీ అసలు సూత్రధారులు ఎవరు అన్నదానిపై త్వరలోనే ప్రకటన చేయనుంది.

ఈ నేపథ్యంలో తార్కాకలోని మాల్కం టేలర్‌ అనే వ్యక్తి ఇంట్లో తీసిన 11 నిమిషాల వీడియో బయటకువచ్చింది. టీడీపీ నేత సెబాస్టియన్..స్టీఫెన్ సన్‌తో జరిపిన బేరసారాలు వీడియోలో బహిర్గతమయ్యాయి. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే,ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్‌ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్‌ ఓకే అయిందని సెబాస్టియన్‌ స్టీఫెన్‌ సన్‌తో చెప్పడం సంచలనంగా మారింది.

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకే పెద్ద ఎత్తున నోట్ల కట్టలకు పనిచెప్పారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో భాగంగా నామినెటెడ్ సభ్యులు స్టీఫెన్‌ సన్‌తో 5 కోట్ల ఢీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈ విషయం భయటికి వెలుగరావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్‌, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

https://youtu.be/HVlr6n1oeBM

- Advertisement -