విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు.. నెక్ష్ట్ ఆయనే సీఎం

192
Vishnu Kumar Raju sentional comments on ap politics
- Advertisement -

చంద్రబాబుపై, టీడీపీ ప్రభుత్వంపై  రోజు తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచే విష్ణుకుమార్‌రాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు మరోసారి విరుచుకుపడ్డారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

Vishnu Kumar Raju sentional comments on ap politics

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దోరికిన వ్యక్తి చంద్రబాబని, హైదారాబాద్‌లో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించే అక్కడినుంచి విజయవాడకు మకాం వేశారని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. తాజాగా చంద్రబాబు కర్ణాటకలో ఉన్న తెలుగు వారు ఇబ్బంది పడే ఆరోపణలు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి తెలుగు వారు ఓట్లు వేయకూడదని ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఇలాంటి సలహాలు తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న ఇలాంటి ఆరోపణలతో కర్ణాటకలో ఉన్న తెలుగు వారు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు. టీడీపీ సంబంధించిన అవినీతిని త్వరలో బయటపెడతామని అన్నారు.

- Advertisement -