విరూపాక్ష…సాయి లుక్‌ వైరల్‌

51
- Advertisement -

యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్న తర్వాత టాలీవుడ్‌ యువ హీరో సాయి ధరమ్ తేజ్‌ నటిస్తోన్న ప్రాజెక్ట్‌ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో SDT15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దీంట్లో సాయి జీప్‌పై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తెలుగు తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మలయాళ భామ సంయుక్తా మీనన్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్ పోషిస్తుంది. ఈ మూవీకి కాంతార ఫేం అంజనీశ లోక్నాథ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్‌ పవన్‌కళ్యాణ్‌తో కలిసి వినోదాయ సీతమ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ నటుడు దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ తో ఓ చెడ్డవాడి కథ!

అందుకే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కి వెళ్లలేదు!

ఐరా క్రియేషన్స్‌లో త్రినాథరావు కొత్త సినిమా..

- Advertisement -