కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్..

301
- Advertisement -

కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు(1,992) చేసిన మూడో క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్ టీ20లో సిరీస్ లో రెండవ మ్యాచ్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ 22 పరుగులు చేసి ఈ ఘనత నెలకొల్పాడు.

ireland-india-

పొట్టి ఫార్మాట్ లో అత్యధిక పరుగుల చేసిన క్రికెటర్లుగా మొదటి, రెండు స్థానాల్లో న్యూజిలాండ్ క్రికెటర్లే ఉండటం విశేషం. మార్టీన్ గుప్తిల్(2,271) పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, (2,140) పరుగులతో బ్రెండ్ మెకలమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. (1,992) పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక పసికూన ఐర్లాండ్ తో జరిగిన టీ20ల్లో గెలిచి,  భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ట్వీ20 మ్యాచ్ భారత్ 75 పరుగుల తేడాతో గెలవగా… రెండవ మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసింది. 143 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. పసికూన ఐర్లాండ్ పై ఇటు బ్యాట్స్ మెన్స్, అటు బౌలర్లు అద్భుత ప్రదర్శణ కనబరిచారు.

- Advertisement -