ఖాళీ స్టేడియాల్లో క్రికెట్..బెస్ట్: విరాట్

265
kohli
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు టోర్నీలు రద్దైన సంగతి తెలిసిందే. ఇక క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్ సహా పలు టోర్నిలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా క్రికెట్‌కు నిజమైన అవకాశం ఉంటుందన్నాడు కోహ్లీ. అభిమానులు లేని స్టేడియంలో ఆడటం ద్వారా క్రికెట్‌ను మరింతగా ఆస్వాదించవచ్చాన్నాడు.

ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో అభిమానులను స్టేడియంలోకి అనుమతించరనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -