మోడీతో విరుష్క జోడి

206
Virat , Anushka invite Modi to their wedding party
- Advertisement -

గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో డిసెంబర్ 11న హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా పెళ్లై, హనీమూన్‌ ముగించుకొని భారత్‌కు చేరుకున్న విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరికీ అభినందనలు తెలిపారు.

గురువారం (డిసెంబర్ 21) ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని విరుష్క జోడీ మోడీని ఆహ్వానించింది.  గురువారం నాటి రిసెప్షన్.. బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేయగా.. డిసెంబర్ 26న ముంబైలో క్రికెటర్ల, వివిధ రంగాల ప్రముఖుల కోసం విరుష్క జోడీ మరోసారి విందు ఇవ్వనుంది. కోహ్లీ డిసెంబర్ 27న భారత జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరనున్నాడు.

- Advertisement -