- Advertisement -
విక్రమ్ కథానాయకుడిగా విజయ్ చందర్ దర్శకత్వంలో ‘స్కెచ్’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి.
ఇందులో విక్రమ్కు జంటగా నటి తమన్నా తొలిసారిగా నటిస్తోంది. విజయ్చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
కాగా ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సంగీతదర్శకుడు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
నవంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కోలీవుడ్ లో తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని తమన్నా భావిస్తోంది. ఈ సినిమా తరువాత ‘ధ్రువ నక్షత్రం’ సినిమాను పూర్తి చేసి, ‘సామి 2’ సినిమా కోసం హరితో కలిసి విక్రమ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -