బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన ‘విక్రమ్’..

120
bahubali
- Advertisement -

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.300 కోట్లు రాబట్టిన ఈ చిత్రం తమిళనాడులో బాహుబలి-2 రికార్డును కూడా అధిగమించింది. విక్రమ్ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ.150 కోట్లు వసూలు చేసింది. 2017లో వచ్చిన బాహుబలి-2 చిత్రం తమిళనాడులో రూ.146 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డును కమల్ కొత్త సినిమా బద్దలు కొట్టింది.

- Advertisement -