బెంగళూరులో భారీ వర్షం.. టీ20 సిరీస్‌ రద్దు..

118
India vs South Africa
- Advertisement -

నిన్న జరిగిన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌కు నిరాశాజనక ముగిసింది. నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరు మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడడంతో, తీవ్రంగా శ్రమించి మైదానాన్ని సిద్ధం చేశారు. అయితే, మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే మళ్లీ వర్షం పడడంతో ఆటగాళ్లు, అంపైర్లు మైదానాన్ని వీడారు.

టీమిండియా 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసిన దశలో మొదలైన వర్షం చాలాసేపు కొనసాగింది. దాంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వర్షపు నీరు చేరింది. ఓవర్లు తగ్గించినా మ్యాచ్ జరిపే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో చెరో రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి.

- Advertisement -