ఓటీటీలోకి విజయ్ ‘ఖుషి’!

29
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టింది. ఇలాంటి క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇటీవల కాలంలో రాలేదనే ప్రశంసలు ఈ మూవీకి దక్కాయి. పాజిటివ్ టాక్ రావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయింది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ్టి నుండే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి థియేటర్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించారు.

Also Read:స్కంద 2 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

- Advertisement -