టర్కీలో ఖుషీగా సామ్-విజయ్!

24
- Advertisement -

విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాపై విజయ్‌ – సమంత భారీ అంచనాలు పెట్టుకోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు శివ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. షూటింగ్‌ మధ్యలో విజయ్ – సమంత టర్కీ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా వైరల్‌గా మారాయి.

Also Read:Amla:ఉసిరితో ఉపయోగాలు

వాస్తవానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది కానీ సమంత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడటంతో షూటింగ్‌ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారు.

Also Read:MP Santhosh:బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం

- Advertisement -