కోటి సాయం.. విజయ్ దేవరకొండ గ్రేట్

10
- Advertisement -

విశాఖపట్నంలో జరుగుతున్న ఖుషీ సినిమా సక్సెస్ మీట్‌లో హీరో విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశాడు. 100 మంది తన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించాడు. 100 మంది అభిమానుల కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. తన రెమ్యునరేషన్ నుంచి వీటిని అందించనున్నట్లు తెలిపాడు. మొత్తం 100 మంది కుటుంబాలకు రూ.కోటి సాయాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప విషయమే. ఇంతవరకు ఏ హీరో తన అభిమానులకు లక్ష ఇచ్చింది లేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కోటి రూపాయలు సాయం చేస్తున్నాడు.

అలాగే ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ లో రౌడీ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించాడు. దీనికోసం డబ్బులిచ్చి ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, రేటింగ్‌లు పెట్టించారని పేర్కొన్నాడు. ‘ఖుషి’ సినిమాకు కూడా ఫేక్ రివ్యూలు ఇప్పించారని విజయ్ దేవరకొండ మండిపడ్డారు. కానీ, ప్రేక్షకులు వారికి తగిన గుణపాఠం చెప్పి సినిమాను సక్సెస్ చెప్పించారని తెలిపాడు. మొత్తానికి తన పై కుట్ర జరుగుతోంది అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also Read:సైంధవ్‌లో ఆర్య!

మొత్తమ్మీద విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.70.23 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మరో మూడు రోజుల్లో ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరనున్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

- Advertisement -