- Advertisement -
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు విజయ్ని విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో రూ.కోట్లు తారుమారు నేపథ్యంలో ఈడీ విచారణ చేపట్టింది.
ప్రమోషన్ చేసిన వారికి నిర్వాహకులు భారీగా డబ్బులు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. విజయ్ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలించారు అధికారులు. ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాల్లో విచారణ కొనసాగింది.
అవసరమైతే మళ్ళీ విచారణకు వస్తానని అధికారులకు చెప్పారు విజయ్ దేవరకొండ.
Also Read:జయశంకర్..స్ఫూర్తి మరువలేనిది:కేసీఆర్
- Advertisement -

