- Advertisement -
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సరిహద్దు దాటి తమ జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్నారు శ్రీలంక నేవీ అధికారులు.
శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని మన్నార్ సమీపంలో జాలర్లను అరెస్ట్ చేయడంతో పాటు రెండు మర పడవలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై స్పందించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు స్టాలిన్. ప్రస్తుతం శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని తన లేఖలో గుర్తు చేశారు స్టాలిన్.
Also Read:రక్తదానంతో ఎనలేని సంతృప్తి: చిరు
- Advertisement -

