11వ రోజుకు సహస్రాబ్ది ఉత్సవాలు..

53
samatha
- Advertisement -

హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. బాబా రాందేవ్, నటుడు అల్లు అర్జున్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించారు.

ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర జపం జరిగింది. అనంతరం యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయాగం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి పరమేష్టి ఇష్టి, వైభవేష్టి ఇష్టి హోమాలు నిర్వహించనున్నారు.

ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముచ్చింతల్‌ చేరుకుంటారు. రామానుజాచార్యుల విగ్రహంపై 3డీ మ్యాపింగ్‌ను వీక్షించనున్నారు.

- Advertisement -