స్వర్ణభారత్ ఆధ్వర్యంలో మరిన్ని మొక్కలు నాటుతాం..

150
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ఊతమిస్తూ, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపా వెంకట్ సహా కుటుంబ సభ్యులు బెంగుళూరులోని దేవనహళ్లిలో సాదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమ అనంతరం ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ,కూతురు దీపమ్మలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుధీర్… వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. అడవులు,చెట్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని, ఇప్పటికే ఉషరాష్ట్రపతి స్ఫూర్తితో ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సైతం తమ ట్రస్ట్ సహకారం అందిస్తుందని, పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సహకరిస్తామని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ తెలిపారు.

- Advertisement -