దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు- ఉపరాష్ట్రపతి

186
- Advertisement -

రాఖీ బంధన్ సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్ల మధ్య అవ్యాజమైన ప్రేమకు ప్రతిరూపం రాఖీ పౌర్ణమి అని అన్నారు. తోడబుట్టినవారే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ మన సోదరులే అనే భావన పెంపొందించడమే ఈ పండుగ ఉద్దేశమని ట్వీట్‌ చేశారు.

‘సోదరుడు, సోదరి మధ్య అవ్యాజమైన ప్రేమకు ప్రతిరూపమైన రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. మనతో రక్తం పంచుకుని పుట్టిన వారే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ మన సోదరులే అనే భావన పెంపొందించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఒకరికొకరు రక్షణగా దేశాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్వీట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -