కోర్టు పక్షుల రెక్కలు విరిగాయి: వేణుగోపాలాచారి

490
venugopala chary
- Advertisement -

రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలాచారి.

కోర్టు పక్షుల రెక్కలు విరిగాయని ఎద్దేవా చేసిన వేణుగోపాలచారి..హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుతో రాష్ట్ర అభివృద్దిని పదేపదే అడ్డుకొంటున్న కోర్టు పక్షుల రెక్కలు విరిగాయని తెలిపారు.

ప్రతిపక్షాలు ఇకనైనా బాధ్యతాయుతంగా మెలగుతూ, నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి కూడా అడ్డంకులు తొలగించడానికి కోర్టు సూమోటోగా ఆ కేసును విచారణకు తీసుకోవాలన్నారు.

- Advertisement -