శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య..

157
venkaiah
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్య… కుటుంబ సమేతంగా శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని …దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు వెంకయ్య.

ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

- Advertisement -