రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ..

223
vemulawada
- Advertisement -

రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా వేములవాడ డివిజన్ ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ జారీ చేసింది రెవెన్యూశాఖ.ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయగా ఇందులో వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్ పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలు ఉన్నాయి.

ఇటీవలె సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరగా మండలాల సంఖ్య 590కి చేరింది.

- Advertisement -