నీతి వంతమైన పాలనను అందిద్దాం!

487
vemulawada
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు నీతి వంతమైన పాలనను అందిద్దాం అన్నారు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ రాజెందర్ శర్మ లు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణ, దేవాలయాభివృద్దికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 20, 21 తేదీలలో కోటి రూపాయలతో అద్భుతమైన శివార్చన నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుముకట్టాలని చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రత్యేక సూచనలు చేశారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని తాను, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి స్వయంగా త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -