వీరసింహారెడ్డి ఓటీటీలోకి ఎప్పుడంటే…

15
- Advertisement -

సంక్రాంతి బరిలో నిలిచి మెగాస్టార్‌ చిరంజీవితో సై అన్న బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

గోపిచంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్‌, హనీరోజ్‌ కథానాయికలుగా నటించారు. ఇందులో దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్, మురళి శర్మ తదితరులు కీలకపాత్రలో నటించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 23న సాయంత్రం 6గంటలకు స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి…

కలకత్తాలో చిరు!

ఒక రోజు వెనక్కి

సోషల్ డ్రామాతో హిట్ కొడతాడా ?

- Advertisement -