ఆ హీరోగారబ్బాయి ఇప్పుడు డైరెక్టర్

6
- Advertisement -

తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాధవన్. ఐతే, ఈ హీరోగారి తనయుడు ‘వేదాంత్ మాధవన్’ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 5 బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ‘వేదాంత్ మాధవన్’ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇంతకీ, ఈ సినిమా నిర్మాత ఎవరో తెలుసా ?, కమల్ హాసన్ అట. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే తన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్’ నుంచి మాధవన్ కొడుకు వేదాంత్ దర్శకుడిగా ఏంటి ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి వేదాంత్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఈ వార్త పై వేదాంత్ మాట్లాడుతూ.. ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను.

కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ను ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. ముఖ్యంగా కమల్ హాసన్ గారి దగ్గర పని చేసే అవకాశం రావడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం. నా సినిమాని రూపొందించే క్రమంలో ఆయన నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాను అని చెప్పడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేయబోతున్నారు’ అంటూ వేదాంత్ మాధవన్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి వేదాంత్ మాధవన్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఇంతకీ, ఈ హీరోగారి అబ్బాయి సినిమాలో హీరో ఎవరు అనేది చూడాలి. ఏది ఏమైనా వేదాంత్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన కమల్ హాసన్ కి మాధవన్ థాంక్స్ చెబుతున్నాడు. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మా అబ్బాయికి ఎంతో సపోర్ట్ అందిస్తున్న రాజ్ కమల్ ఫిల్మ్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో అధికారికంగా ప్రకటిస్తారట.

Also Read:IND vs SA T20:బోణి కొట్టేదెవరు?

- Advertisement -