మొక్కలు నాటిన వసుధ మూవీ టీం..

265
green
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశషన్ నగర్ లో మొక్కలు నాటారు మసుధ మూవీ టీం. ఈ సందర్భంగా నటి, నటులు తిరువీర్, కావ్య మరియు భాంధవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

నవంబర్ 18 న మసుధ మూవీ రిలీజ్ అవుతున్న సందర్బంగా అందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనడం ఒక పండగ వాతావరణం లా అనిపించింది అన్నారు.మంచి వాతావరణం మంచి ఆక్సీజన్ కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.సందర్బం ఏది అయినా మొక్కలు నాటుతాం అని అందరూ కూడా నాటాలని, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అన్నారు.

gic

సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఇంకా ఎన్నో మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం లో అవకాశం కల్పించినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్, డైరెక్టర్ సాయి కిరణ్ పలువురు పాల్గొన్నారు.

- Advertisement -