వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్

145
- Advertisement -

వరుస దెబ్బలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సతమతమవుతోంది. ఇప్పటికే మూడు సార్లు ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తాజాగా మరోసారి ప్రమాదానికి గురైంది.. శనివారం ఉదయం ముంబై సెంట్రల్​ నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న వందే భారత్​ ఎక్స్‌ప్రెస్‌ ఓ ఎద్దును ఢీకొట్టింది. ట్రాక్‌పై పశువు ఢీకొనడంతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ముందు భాగంలో డ్రైవర్‌ కోచ్‌ స్వల్పంగా దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ట్రైన్‌ 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.

అక్టోబర్​ 6న ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్​ రైల్వే స్టేషన్​ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్​ ప్యానెల్​ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్​ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్​ సమీపంలో ఓ ఆవు వందేభారత్​ రైలును ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి.

కాంతారకు ఎదురుదెబ్బ ఎందుకో తెలుసా

మంచి దొంగ.! దొంగిలిచ్చిన సొమ్ము తిరిగిచ్చేశాడు

మునుగోడు బైపోల్ తర్వాతే విచారణ.

- Advertisement -