వజ్రాలు కావాలా నాయనా..

214
Vajralu Kavala
- Advertisement -

అనిల్ బూరగాని హీరోగా నేహా దేశ్ పాండే ,నిఖిత బిస్ట్ హీరోయిన్ లుగా పి. రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట శ్రీపాద ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించిన చిత్రం వజ్రాలు కావాలా నాయనా. ఈ చిత్ర ఆడియో వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుక లో ప్రతాని రామకృష్ణ గౌడ్ , తుమ్మలపల్లి రామసత్యనారాయణ , సాయి వెంకట్ , దర్శకులు రాధాకృష్ణ , నిర్మాత కిషోర్ కుమార్ , సంగీత దర్శకులు జాన్ పోట్ల తదితరులు పాల్గొన్నారు. బిగ్ సిడి ఆడియో ని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించగా ……సిడి ని సాయి వెంకట్ ఆవిష్కరించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ కు తొలి సీడీ ని అందించారు.

Vajralu Kavala

ఈ సందర్బంగా హీరో అనిల్ మాట్లాడుతూ ” ఆరు సంవత్సరాలుగా సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత కోట కిషోర్ కుమార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడని , నన్ను నమ్మి మంచి బడ్జెట్ తో ఈ సినిమా చేసాడని …… అమ్మా నాన్న లు నాకు జన్మనిచ్చారు అయితే సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చి కిషోర్ గారు పునర్జన్మ ఇచ్చారని , మొదటిసారి లొకేషన్ కి వెళ్ళినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను కానీ నా టెన్షన్ అంతా పోగొట్టి కూల్ గా సినిమా చేసేలా నన్ను ఎంతో ప్రోత్సహించాడు దర్శకులు అంటూ కృతఙ్ఞతలు తెలిపాడు .

నిర్మాత కిషోర్ కుమార్ మాట్లాడుతూ ” కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికే నేను ఈ బ్యానర్ ని స్థాపించాను . నేను రాసుకున్న కథ కు తగ్గట్లుగా నటీనటుల ఎంపిక చేశామని ,4 పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని ఆ క్రెడిట్ అంతా సంగీత దర్శకులు జాన్ పోట్ల …. సాహిత్యం అందించిన సురేశ్ గంగుల , రవికిరణ్ లదే నని అన్నారు.

దర్శకులు రాధాకృష్ణ మాట్లాడుతూ ” ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సినిమా పై మక్కువతో వి ఎఫ్ ఎక్స్ లో చేరాను అదే సమయంలో నిర్మాత కిషోర్ గారు పరిచయం అయ్యారు . అడగందే అమ్మ అన్నం పెట్టదు కానీ నేను డైరెక్షన్ ఛాన్స్ అడగకుండానే నన్ను డైరెక్టర్ ని చేసిన గట్స్ ఉన్న నిర్మాత తప్పకుండా మా వజ్రాలు కావాలా నాయనా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రతాని రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ ఈ చిత్రం లోని సాంగ్స్ చాల బాగున్నాయి, నటీనటులందరికి మంచి పేరు తీసుకువస్తుంది.ఈ చిత్రం విడుదలకు అన్ని సహాయసహకారాలు అందిస్తాను, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అనిల్ బూరగాని,నేహాదేశ్ పాండే, నిఖిత బిస్థ్,విజయ్ సాయి,చిట్టిబాబు,శివ,అశ్విని,కుందన, కోట కిషొర్ కుమార్,ప్రసాద్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్ కుమార్,అర్ట్: డేవిడ్,కొరియోగ్రఫీ: వేణు మాస్టర్,సంగీతం:జాన్ పోట్ల,బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శివప్రసాద్,పాటలు:సురేష్ గంగుల,రవికిరణ్,ఎడిటర్: రమారావు జె.పి., కధ,నిర్మాత: కిషొర్ కుమార్ కోట,కధనం,మాటలు,దర్శకత్వం: పి. రాధాక్రిష్ణ.

- Advertisement -