స్మృతి స్థల్ కు చేరుకన్న అంతిమయాత్ర..

261
Vajpayee's funeral at Smriti Sthal
- Advertisement -

ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ మార్గ్‌ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన మాజీ ప్రధాని వాజ్‌ పేయి అంతిమయాత్ర స్మృతి స్థల్ కు చేరుకుంది. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర సాగింది. కాగా..కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలత వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వాజ్ పేయి అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొనగా..వాజ్ పేయి భౌతిక కాయానికి త్రివిధ దళాదిపతులు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు తుది నివాళులర్పించారు.

- Advertisement -