పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. గాజు పగలే కొద్దీ పదునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అని కౌంటర్ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ జూన్ రెండో వారం నుంచి మొదలు కాబోతుంది అని క్లారిటీ ఇచ్చారు.దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:GHMC:స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

