కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న అమెరికా..

88
us
- Advertisement -

కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది అమెరికా. రోజుకు 3000 మందికి పైగా ప్రాణాలు కొల్పోగా కొవిడ్ మరణాలు, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది.

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి వరకు టీకా అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఫైజర్ సంస్థ పిల్‌ను తీసుకొచ్చింది. దీని వినియోగానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక ఫిన్లాండ్‌లో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొవిడ్ ఆంక్షలను క్రమంగా సడలించాలని నిర్ణయించినట్టు ఆ దేశ ప్రధాని సన్నా మారిన్ తెలిపారు.

- Advertisement -