డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం..

90
drugs case
- Advertisement -

డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్‌గా ఉన్న టోనీ నుండి కీలకసమాచారం సేకరించిన పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వారికోసం గాలింపు ముమ్మరం చేశారు.

డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. టోనీ పట్టుబడడంతో కొందరు వ్యాపారవేత్తలు అజ్ఞాతంలోకి వెళ్లారు. నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా చేపట్టారు.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో A1 టోనీ, A2 ఇబ్రాన్ బాబు షేక్ , A3 నూర్ అహమ్మద్ ఖాన్ A10 నిరంజన్ కుమార్ జైన్, A11 శేషావత్ జైన్, A12 యజ్ఞానంద్ అగర్వాల్ , A13 దండు సూర్య సుమంత్ రెడ్డిలు సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -