మొక్కలు నాటిన యువ నటి ఊర్వశి రాహుటేలా

278
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు యువ నటి, మిస్ యునివర్సల్ ఊర్వశి రాహుటేలా.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందనలు తెలియజేశారు. ప్రముఖ నటులు ప్రభాస్ మహేష్ బాబు విజయ్ లాంటి ప్రముఖులు పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నీను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.

- Advertisement -