21 ఏళ్ల రికార్డు తిరగరాసిన ఉప్పెన..!

311
uppena
- Advertisement -

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి సినిమానే అయిన హీరో, దర్శకులు చేసిన ప్రయత్నం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఉప్పెన విడుదలైన మూడు రోజుల్లోనే టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన ఒక డెబ్యూ హీరో చిత్రంగా నిలిచింది.

భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఉప్పెన బద్దలుకొట్టింది. గతంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తొలిచిత్రం ‘కహో నా ప్యార్ హై’ ఫుల్ రన్‌లో రూ.41 కోట్లు వసూలు చేయగా ఉప్పెన ఐదు రోజుల్లోనే రూ.42 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా సత్తాను చాటింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 33 కోట్ల వసూళ్లను రాబట్టగా ఓవర్సీస్‌తో పాటు మిగితా రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టి ఉప్పెన సృష్టించింది.

- Advertisement -