హరితహారంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్..

441
Uppala Srinivas Gupta
- Advertisement -

6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గౌరిల్లిలో ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మ ప్రాణాన్ని ఇస్తే మొక్క ప్రాణ వాయువును ఇస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు.

పర్యావరణ పరిరక్షణకు, హరిత తెలంగాణ ధ్యేయంగా సీఎం గత 6 సంవత్సరాలుగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం భావి తరాల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ఉప్పల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -