ఎంపీ సంతోష్‌ని కలిసిన ఉప్పల శ్రీనివాస్

365
uppala srinivas
- Advertisement -

రాజ్య సభ సభ్యులు, జోగినపల్లి సంతోష్ రావు కుమార్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్ర తెరాస వైశ్య నాయకులు, ఐ వి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త .ఈ సందర్భంగా సంతోష్‌కి ఏక బిల్వం మొక్క ని అందజేసి శివుడి కి అతి ప్రీతికరమైన ఏక బిల్వం ఆకులు అని ఈ ఆకుల తో శివుడి కి అభిషేకం చేస్తారు అని హరితహారం లో ఇలాంటి ఏక బిల్వం మొక్కలు నాటి తే శివుడి ఆశీర్వాదాలు కూడా మన తెలంగాణ రాష్ట్ర హరిత వనం కి ఉంటాయి అని తెలియ జేశారు.

సంతోష్ అంటే ఉప్పల శ్రీనివాస్ కి అమిత మైన ప్రేమ అభిమానం, సంతోష్ కుమార్ హరిత హీరో, ఈ రోజు దేశం లో తెలంగాణ రాష్ట్రం లో ఆకు పచ్చ తెలంగాణ గా ఉండాలన్నదే ఆయన అభిమతం అన్నారు. సంతోష్ పిలుపు తో లక్షలాది మంది ప్రేమ తో మొక్క లు నాటుతున్నారు అని తెలిపారు.కరోనా కష్ట కాలం లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపు మేరకు 33 జిల్లాల ఐ వి ఎఫ్ అధ్యక్షులు ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ చేస్తూ మూడున్నర లక్షల మందికి భోజనాలు పెట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ పీరియడ్ లో ఒక లక్ష 50 వేల మందికి భోజనాలు పెట్టడం, 14 వేల మంది కి నిత్యవసర సరుకులు అందించడం, డాక్టర్ లకి, పోలీస్ లకి, జర్నలిస్టుల కి, మున్సిపల్ కార్పోరేషన్ పారిశుధ్య సిబ్బంది కి సేఫ్టీ కిట్లు 4000 వేల మంది కి అందజేసి నట్లు సంతోష్‌కి తెలిపారు శ్రీనివాస్.కష్ట కాలం లో పేదలకు సేవలందించిన ఉప్పల ఫౌండేషన్ , ఐవీఎఫ్ తెలంగాణ సంస్థల ని, ప్రతినిధులని, ఉప్పల శ్రీనివాస్‌ని అభినందించారు ఎంపీ సంతోష్. ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త తనయులు, సాయి కిరణ్, సాయితేజ పాల్గొన్నారు.

- Advertisement -