కూలీల కడుపు నింపుతున్న ఉప్పల పౌండేషన్..

222
uppala srinivas
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. మూడు వారాలుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని వారికి భోజనం చేయడం కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త లాక్ డౌన్ విధించిన నాటినుంచి వలస కార్మికులకు ఉప్పల పౌండేషన్ తరఫున నిత్యావసరాలు అందిస్తూ వస్తున్నారు.

Uppala foundation

ఈ రోజు రాక్ టౌన్ కాలనీలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మహరాష్ట్రలకు చెందిన వలస కూలీలకు, సెక్యూరిటీ సిబ్బందికి, భవన నిర్మాణ కార్మికులకు మిత్రుడు రవీంద్ర రెడ్డి కోరిక మేరకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, ఉప్పు, కారం, పసుపు వంటి నిత్యావసర వస్తువులను అందించారు.

- Advertisement -