- Advertisement -
రెండవసారి కరిస్తే కుక్కకు జీవిత ఖైదు విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
మొదటిసారి మనిషిని కరిచిన కుక్కను 10 రోజుల పాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి.. టీకా వేసి, శరీరంలో మైక్రో చిప్ను అమర్చి విడుదల చేయనున్నారు. రెండో సారి ఆ కుక్క కరిస్తే దాన్ని అదే కేంద్రంలో జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు చేయనున్నారు.
కుక్క కాటుపై పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టారు. కరిచినట్లు పూర్తి ఆధారాలు ఉంటేనే కుక్కకు జీవిత ఖైదు విధించనున్నారు.
Also Read:అమెరికాలో మళ్లీ టిక్టాక్..!
- Advertisement -

