అన్‌స్టాపబుల్…రికార్డులు బ్రేక్!

195
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. తాజాగా సెకండ్ సీజన్ ఇటీవలె ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. ఫస్ట్ సీజన్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది.

ఇక రెండో ఎపిసోడ్‌కి అతిథిగా సిద్దూ జోన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ సైతం మంచి వ్యూస్‌ని రాబట్టింది. తనదైన శైలీలో ప్రశ్నలతో వారిద్దరిని ఉక్కిరిబిక్కిరి చేశారు బాలయ్య. ముఖ్యంగా బాలయ్య డైలాగ్‌లు ఎపిసోడ్‌పై అంచనాలను అమాంతం పెంచేశాయి.

దీంతో మూడో ఎపిసోడ్‌కి ఎవరు వస్తారో అన్న ఉత్కంఠకు తెరదించేశారు నిర్వాహకులు. రెండో సీజన్ మూడో ఎపిసోడ్‌కి అతిథులుగా శర్వానంద్ – అడవి శేష్‌ రాగా ఇందుకు సంబంధించిన ప్రొమోని రిలీజ్‌ చేశారు. శర్వా – శేషు ఇద్దరూ కూడా బ్యాచ్ లర్స్ కావడంతో, ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరింత కామెడీగా బాలయ్య వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ప్రొమోలో ఇద్దరిని ఇరకాటంలో పెట్టారు బాలయ్య బాబు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఈ నలుగురిలో ఎవరు నెంబర్ వన్ యాక్టర్? అని అడగ్గా ఇద్దరూ బాలయ్యకు చేతులెత్తిదండం పెట్టారు. అలాగే ‘ఏ హీరోయిన్ తో కిస్ వద్దురా బాబూ అనిపిస్తుంది?” అంటూ మరో ప్రశ్నను అడిగారు. అదేవిధంగా జాను సినిమా షూటింగ్ సమయంలో శర్వానంద్‌కి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రొమో ఇప్పుడు ట్రెండింగ్‌లో మారగా పూర్తి ఎపిసోడ్ నవంబర్ 4న ప్రసారం కానుంది. ప్రొమో ఆసాంతం ఎమోషనల్‌గా సాగగా ఈ షో పూర్తి ఎపిసోడ్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

జోడో జోష్..రాహుల్‌తో బాలీవుడ్ నటి

ఓటీటీలోకి గాడ్‌ ఫాదర్.

- Advertisement -