మాజీ సీఎం కిరణ్‌తో బాలయ్య దబిడి దిబిడే!

195
kiran
- Advertisement -

ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. తొలి సీజన్ మంచి సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ని కూడా అంతకమించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరూ ఉహించని విధంగా తొలి సీజన్‌కు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ గెస్ట్‌లుగా వచ్చారు. తాజాగా నాలుగో ఎపిసోడ్‌కి గెస్ట్ లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సురేశ్‌ కుమార్ రెడ్డి వచ్చారు.

ఇందుకు సంబంధించిన ప్రొమో రిలీజ్ చేయగా మంచి వ్యూస్ రాబట్టింది. బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు, ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది అంటూ గెస్ట్‌లను పరిచయం చేశారు. తనకు ఎంతో సన్నిహితులైన స్నేహితులు, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఏపీ రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కె.సురేశ్ రెడ్డి అంటూ వారితో ఉన్న స్నేహాన్ని పంచుకున్నారు బాలయ్య.

కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య క్రికెట్ ఆడుతుండగా.. ఈ మధ్యలో సీనియర్ హీరోయిన్, నటి రాధిక కూడా ఎంట్రీ ఇచ్చింది. పూర్తి ఎపిసోడ్‌ను నవంబర్ 25న టెలికాస్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -