‘ఒకటి, రెండు అత్యాచారాలకు ఇంత రాద్దాంతమా..?’

259
- Advertisement -

కేంద్రకార్మిక, ఉపాధిశాఖ సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా వంటి పెద్ద దేశంలో ఒకటి, రెండు అత్యాచార ఘటనలు జరిగితే ఇంత రాద్దాంతం అవసరమా అంటూ ప్రశ్నించారు.

అయితే పన్నెండేళ్ళలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే వారికి కోర్టులు ఉరిశిక్ష విధించేందుకు సమగం చేసే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆమోదం తెలిపారు. అదే రోజున గాంగ్వార్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదం రేపాయి.

 Union Minister Santosh Gangwar Comments on Rape Cases..కథువాలో ఓ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం , హత్య..అలాగే ఉన్నావోలో 17 ఏళ్ళ అమ్మాయిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన ఇలాంటి సందర్భంలో కేంద్ర మంత్ర ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక సంతోష్‌ గాంగ్వార్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -