కేంద్ర బడ్జెట్ 2022-23 అప్‌డేట్స్‌..

69
- Advertisement -

ఈరోజు లోక్ సభలో పేపర్ లెస్ విధానంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్‌ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ హైలైట్స్

-కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.
-2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.
-2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.
-అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.
-రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం.
-పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.
-యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
-పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం.
-ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
-అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.
-బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.
-విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.
-ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.
-రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.
-ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నాం.
-2 లక్షల అంగన్ వాడీలలో వసతులను మెరుగుపరుస్తాం.
-ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నాం.
-డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.
-బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ.
-అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.
-8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు.

- Advertisement -