తెలంగాణ హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భుయాన్‌..

73
Ujjal Bhuyan
- Advertisement -

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది కేంద్రం. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ సీజేగా పదోన్నతి లభించింది.

ఇక జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 1964, ఆగస్ట్‌ 2న గౌహతిలో జన్మించారు. ఆయన గౌహతిలోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యసించారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఉజ్జల్ భుయాన్ గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గౌహతి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా పని చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. అలాగే 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

- Advertisement -