దేశ రక్షణలో మిలట్రీ పాత్ర ఆమోఘం- మంత్రి జగదీష్ రెడ్డి

149
minister jagadish reddy
- Advertisement -

దేశ రక్షణలో మిలట్రీ పాత్ర ఆమోఘమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మిలట్రీ సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోటే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అటువంటి వృత్తిని ఎంచుకుని దేశరక్షణలో ముందుండి పోరాడిన గోపయ్య చారి,కల్నల్ సంతోష్ బాబుల అమరత్వం అజరమారమని ఆయన కొనియాడారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇన్.ఇమ్మడి పవన్ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఉద్యోగం సాధించిన సందర్భంగా ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు.

దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సూర్యాపేట ఎస్ వి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మిలట్రీ వృత్తిని ఎంచుకున్న యువత వర్తమానానికి స్ఫూర్తినందించే విధంగా ఉండాలన్నారు.డి కొత్తపల్లికి చెందిన పవన్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. సరిహద్దుల్లో విదేశీ చొరబాట్లను నిర్ద్వంద్వంగా నిరోదించేది మిలట్రీ సైన్యమే నన్నారు. అటువంటి వృత్తిలో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనిర్వచనీయమైన ఘట్టంగా మంత్రి అభివర్ణించారు. మిలట్రీలో చేరిన వారికి సహజంగానే ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న సంకల్పం ఉంటుందని, ఆ సంకల్పానికి తగినట్లుగానే అవకాశాలు ఉంటాయన్నారు. అటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సభ అనంతరం లెఫ్టినెంట్ ఇమ్మడి పవన్ ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -