తొలిబోనం సమర్పించిన తలసాని స్వర్ణ..

313
mahankali
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఆలయం బయట పండితులకు అందజేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ.మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి ప్రతి సంవత్సరం తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు లేకుండా తొలిసారి అధికారులు, అర్చకుల సమక్షంలో బోనాల వేడుక జరుగుతోంది.భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

- Advertisement -