జూరాలకు కృష్ణమ్మ పరుగులు…

219
jurala project
- Advertisement -

ఈ సీజన్ లో తొలిసారిగా జూరాలకు ఎగువ నుండి వరద నీరు విడుదల చేశారు.నారాయణపుర్‌ డ్యామ్ నుండి నీటిని విడదల చేశారు కర్ణాటక అధికారులు.దీంతో జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ.గత సంవత్సరం కంటే 17 రోజులు ముందుగానే జూరాలకు వరద నీరు చేరనుండగా రేపు సాయంత్రం జూరాలను తాకే అవకాశం ఉంది.

నారాయణ పుర డ్యామ్ పూర్తి సామర్ధ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 33.47 టీఎంసీలు.నారాయణ పుర డ్యామ్ కు ఆల్మట్టి నుండి నలభై వేల క్యూసెక్ ల ఇన్ ఫ్లో….రెండు గేట్ లు ఒక మీటర్ ఎత్తి 11,240 క్యూసెక్ లు జూరాలకు వదులుతున్న అధికారులు.

- Advertisement -