- Advertisement -
తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొని అనునిత్యం ప్రజలతో మమేకమైన నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వేస్తుందనేందుకు ఇదే నిదర్శనము. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కోటా కింద బీఆర్ఎస్ పార్టీకి చెందిన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారీ నవీన్కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి…
ఎంపీ కోమటిరెడ్డి పై కేసు నమోదు
పెట్టుబడుల స్వర్గధామం..మళ్లీ మేమే వస్తాం…
రాహుల్కి పిల్లలు పుట్టరు..వివాదాస్పద కామెంట్స్
- Advertisement -