ఉదయ్ కిరణ్ 40వ జయంతి

326
uday kiran
- Advertisement -

తన సొంత టాలెట్ తో ఎటువంటి వారసత్వం లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు నటుడు ఉదయ్ కిరణ్. అనతికాలంలోనే స్టార్ హిరోగా ఎదిగిపోయాడు. చాలా మంది అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు. కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి వరుస హిట్స్ తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.. దాదాపు ఉదయ్ చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్సే …. మూడు సినిమా ల తోనే అమ్మాయిల్లో కూడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అంతటి స్టార్ ను సంపాదించిన ఉదయ్ కిరణ్ కు వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి. అయినా కుంగిపోకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఓ వైపు వరుస ప్లాప్ లు మరోవైపు వ్యక్తిగత సమస్యలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఆత్మహత్యపై చాలా మంది పలు అనుమానులు వ్యక్తం చేశారు. నేడు ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ జూన్ 26, 1980లో జన్మించారు. ఉదయ్ కిరణ్ తల్లితండ్రులు వీవీకే మూర్తి, నిర్మల. ప్రముఖ దర్శకుడు తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. తనదైన స్టైల్ , నటనతో యువతను ఆకట్టుకున్నాడు. ఈమూవీ పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నువ్వునేను సినిమా కూడా భారీ విజయం సాధించింది. వరుస విజయాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ నటనకు 2001లో ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చింది.

2003లో చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్ధం జరిగింది. కానీ కొన్ని కారణాల పెళ్లి జరుగలేదు. నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు. ఉదయ్ కిరణ్ మొత్తం 22సినిమాల్లో నటించాడు. చివరగా చిత్రం చెప్పిన కథ అనే సినిమాలో నటిస్తుండగా మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమూవీ కొద్ది రోజుల క్రితం పూర్రైంది. కాగా మూవీని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -