మొక్కలు నాటిన బుల్లి తెర నటుడు కౌశిక్ శ్రీకృష్ణ

423
actor
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లి తెర నటుడు రవికిరణ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు బుల్లి తెర నటుడు కౌశిక్ శ్రీకృష్ణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుని ఒక నూలు పోగు లాగా మనం నాటే ఈ మొక్కలు వాతావరణ కాలుష్యానికి తగ్గించటం కోసం ఉపయోగ పడుతుంది అని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా ఒక కవితను పాడటం జరిగింది.
“నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మలు కొమ్మ కొమ్మకు విరబూసి వేలాదిగా కాయాలి బంగారు కాయలు వాటిని తినాలి మన పిల్ల కాయలు”.ఈ సందర్భంగా తన తోటి మిత్రులు రితేష్; జాకీర్ ;సుమిత్ లను ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -