తూర్పు హైదరాబాద్‌కు మరిన్ని ఐటి పరిశ్రమలు: కేటీఆర్

359
ktr
- Advertisement -

హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ది కోసం నగరం నలు మూలలా అభివృద్ది చెందెలా తమ ప్రభుతం ప్రయత్నం చేస్తున్నదని ఐటి శాఖామంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈరోజుహైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఉప్పల్ ఏన్ యస్ ఏల్ ఐటి సెట్ లో సమావేశం అయ్యారు. ఐటి, ఐటి అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు భవిష్యత్తులో రానున్న ఐటీ కంపెనీల ఏర్పాటు వాటికి సంబంధించిన మార్గదర్శకాలను పైన ఈసమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటి ని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ముందుకు రానున్నట్లు తెలిపారు.ఈ పాలసీ ద్వారా పరిశ్రమల అభివృద్ది అన్ని మూలలా జరుగతుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్ కి తరలించే ప్రయత్నం లో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని మంత్రి ఈ సమావేశంలో తెలిపారు. ఇందుకోసం అవసరమైన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన పైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను 5 కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ ఐదు కంపెనీలు సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఐటీ పార్కుల ను లేదా కార్యాలయాలకి అవసరం అయినా ఆఫీస్ స్పేస్ ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తద్వారా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ పరిశ్రమ జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి చెందుతూ వస్తున్నదన్నారు. హైదరాబాద్ పట్టనం నలువైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న గ్రిడ్ విధానంతో ఐటీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళతాయన్న నమ్మకం ఉన్నదన్నారు. ఇప్పటికే ఇక్కడ అందుబాటులో ఉన్న మెట్రో, శిల్పారామం, మూసి నది అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతుల పెరుగుతున్నాయని తెలిపారు.

ఉప్పల్ నుంచి ఘట్కెస్కర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఒవర్ల ద్వారా రోడ్డు మౌళిక వసతులు మరింత పెరుగుతాయన్నారు. ఇప్పటికే నగరం నలువైపులా ఐటీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల పరిశ్రమలు విసర్తించి ఉన్నాయన్నారు. అవుటర్ రింగ్రోడ్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళితే వారి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈస్ట్ హైదరాబాద్ వైపు మరిన్ని ఐటి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సమాచార సంచికను మంత్రి ఈ సందర్భంగా అవిష్కరించారు.ఈ సమావేశంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -