తిరుమలలో తొక్కిసలాట…ముగ్గురికి గాయాలు

276
ttd
- Advertisement -

తిరుమలలో తొక్కిసలాట జరిగింది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద భ‌క్తుల మ‌ధ్య తోపులాట జ‌రుగగా ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గోవిందరాజస్వామి స‌త్రాల వద్ద ఈ తోపులా జరుగగా ఆ ముగ్గురు భ‌క్తుల‌ను తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌లువురు భ‌క్తులు సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు.

రెండు రోజుల తర్వాత స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను ఇవాళ జారీ చేస్తుండటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం కాగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులను మోహరించారు అధికారులు.

- Advertisement -