- Advertisement -
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బియ్యాన్ని జూన్ 11న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నారు.
మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల బియ్యాన్ని వేలానికి ఉంచనున్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు జూన్ 10 ఉదయం 10 గంటలలోపు కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాలి.
మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429.అలాగే టిటిడి వెబ్ సైట్ www.konugolu.ap.gov.inసందర్శించవచ్చు.
Also Read:ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో రష్మిక?
- Advertisement -

